

శివ, గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఆందోళన చేసిన నేపథ్యంలో బ్రిడ్జి పనులు కోసం 10 కోట్ల 30 లక్షలు నిధులు మంజూరు కి ప్రతిపాదన పెట్టిన నిధులు వచ్చాయా??? లేదో!!! తెలియని పరిస్థితి!!
పార్వతీపురం నుండి కు నేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే మార్గంలో ఈ వంతెన శిధిలావస్థకు చేరిన నేపథ్యంలో వందలాది వాహనాలు వెళుతున్న ఇప్పటికే బ్రిడ్జి పూర్తిగా కదిలే పరిస్థితిలో ఏమైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారు!!!
ఇప్పటికైనా రోడ్లు భవనాలు శాఖ అధికారులు ప్రతిపాదన పెట్టిన పది కోట్ల 30 లక్షల రూపాయలు విడుదల చేసి కోటిపాం గ్రామం వద్ద జంజావతి నదిపై నిర్మించిన వంతెన పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం కోటిపాం బ్రిడ్జి పరిశీలించిన అనంతరం
ఆ బ్రిడ్జి వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి సిపిఎం నాయకులు రామారావు పెంటయ్య మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో 1933 వ సంవత్సరంలో పార్వతీపురం నుండి కునేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే రహదారిమార్గంలో జంజావతి నదిపైన కోటిపాము వద్ద బ్రిడ్జి నిర్మించడం జరిగిందని అయితే ఈ బ్రిడ్జి కి సుమారు 92 సంవత్సరాలు కాలం దాటిన సందర్భంగా పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పాటు బ్రిడ్జి పైన పెద్ద పెద్ద గొయ్యలు ఏర్పడే పరిస్థితి ఉందని ఇప్పటికే ఈ గొయ్యలలో వర్షాకాలంలో నీరు చేరి అనేక ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో గతంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక విధాలుగా ఈ బ్రిడ్జి మరమ్మతు పనులు చేపట్టాలని ఆందోళన చేసిన నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు 10 కోట్ల 30 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పడం జరిగిందని అయితే ఈ ప్పటికీ నెలల గడుస్తున్న ఆ నిధులు విడుదల అయ్యావా??? లేదో?? తెలియని పరిస్థితి ఉందని కాబట్టి వెంటనే అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రోడ్లు భవనాలు శాఖ అధికారులు స్పందించి వెంటనే ప్రతిపాదన పెట్టిన నిధులు విడుదల చేసి మరమ్మతు పనులు చేపట్టి మూడు రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులకు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అటు రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయుచున్నాము.
