
శివ, గరుడ న్యూస్ ప్రతినిధి, పార్వతీపురం

పార్వతీపురం, ఫిబ్రవరి 21 : పార్వతీపురం పట్టణానికి చెందిన బాడీ బిల్డర్ ఎస్ కిషోర్ కి ఎమ్మెల్యే విజయ్ చంద్ర క్యాంపు కార్యాలయం వద్ద అభినందించారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బొబ్బిలి లో జరిగిన జోనల్ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో కిషోర్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. నియోజకవర్గానికి చెందిన యువకుడు విజేతగా నిలవడం అభినందనీయమని రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర ఆకాంక్షించారు. ట్రోఫీ ని కిషోర్ కు అందజేశారు.

