గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా సమన్వయకర్త ఎస్. రూపవతి

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

పార్వతీపురం మన్యం జిల్లా, సీతానగరం మండలం లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం జోగింపేట పాఠశాలను ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త ఎస్. రూపవతి సోమవారం ఆకస్మిత తనిఖీ చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జోగింపేట గురుకుల పాఠశాలలో సందర్శించిన ఆమెకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ జేవీఎస్ మధుబాబు, వైస్ ప్రిన్సిపాల్ కె. ఈశ్వరరావు కలిసి సాధారణంగా ఆహ్వానం పలికారు. అనంతరం పాఠశాలకు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులను పరిచయం చేసుకుంటూ 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత అయ్యేటట్లుగా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. పదో తరగతి ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు ను తీసుకు రావాలని, పరీక్షలు రాసే విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు కు సిద్ధమవ్వాలని అన్నారు.అనంతరం విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనంతరం విద్యార్థుల యొక్క పడక గదులు మరియు భోజన వసతి గృహలను పరిశీలన చేసి తగు సూచనలు సలహాలను ఇచ్చారు.

- Advertisement -
Ad image
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *