
పార్వతీపురం మన్యం జిల్లా,పాచిపెంట,ఫిబ్రవరి 25,(గరుడ న్యూస్)
పాచిపెంట మండలంలో రైతులకు సత్వర సలహాలు సూచనలు అందడం కోసం ఒకే రోజు అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఇలా నిర్వహించటం పాచిపెంట మండలంలో ప్రధమంగా మెగా పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిలో తెలిపారు ఈ మెగా పొలం పిలుస్తోంది కార్యక్రమం సందర్భంగా మంచాడవలస శ్యామల గౌరీపురం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమంలో మాట్లాడుతూ రైతులందరూ తాము పండించిన పంటలను ఈ పంట లో నమోదు చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతం రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేయించి విశిష్ట సంఖ్యల కేటాయింపు జరుగుతుందని రైతులందరూ ఈ విశిష్ట సంఖ్యలను పొందాలని తెలిపారు ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వరి మొక్కజొన్న పంటలపై రసం పీల్చు పురుగులు ఆశించే అవకాశం ఉందని రైతులు తప్పనిసరిగా గ్రామ వ్యవసాయ సహాయకుల సలహాలు సూచనలు పొందాలని తెలిపారు ఈ రబీ సీజన్లో మొక్కజొన్న వేసిన రైతులు మరల ఖరీఫ్ సీజన్లో మొక్కజొన్న వెయ్యకుండా పంట మార్పిడి చేసుకోవాలని, అలాగే వేసవిలో బోరు సదుపాయం ఉన్నవాళ్లు అపరాలు సాగు చేసుకుంటే నిరంతరం భూమిని కప్పి ఉంచడం ద్వారా భూమిలో పోషకాలు మరియు సేంద్రియ పదార్ధం వేడికి నష్టపోకుండా చూడవచ్చని వేసవి అపరాలు రాయితీపై అందిస్తామని తెలిపారు రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం జొన్న పంట సాగు చేయబోయే గిరిజన రైతులకు విత్తన కుళికల తయారీపై శిక్షణ ఇప్పించబడుతుందని అలాగే ఘన ద్రవ జీవామృతల తయారీని వివరించబడుతుందని తద్వారా పోడు భూములలో కూడా అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో అందరూ గ్రామ వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు.

