గజ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు..

Sesha Ratnam
1 Min Read

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు గజ వాహనంపై వివరిస్తూ భక్తులను కటాక్షించారు. అలమేలుమంగా వాహన సేవలో గజవాహన సేవకు ప్రత్యేకత ఉంది గజం ఐశ్వర్య సూచకం అందుకే ఆగజాంతగం ఐశ్వర్యం అని ఆర్యోక్తి. పాలసముద్రంలో ప్రభవించిన సిరుల తల్లిని గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంత దేశికులు శ్రీ స్తుతి చేశారు. వాహన సేవలో ఆలయ సీఈవో శ్రీ దేవరాజులు ఉ జి ఓ శ్రీమతి సదాలక్ష్మి, ఆలయ అర్చకులు బాబు స్వామి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *