
తిరుపతి జిల్లా, పాకాల, గరుడ న్యూస్ (ప్రతినిథి): మహాశివరాత్రి పర్వదినాన తలకోన శ్రీ సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈవో, సిబ్బంది
దర్శనానంతరం వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేసిన ఈవో
ఆలయం వద్ద పెద్దిరెడ్డితో పాటు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిలకు సాదర స్వాగతం పలికిన స్థానిక వైసీపీ నేతలు. స్థానిక నేతలతో కలసి అల్పాహారం స్వీకరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి , చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.


