


తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, గరుడ న్యూస్ (ప్రతినిధి): రామచంద్రాపురం మండలంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు శివనామ స్మరణలతో మారుమొగుతున్నాయి. ఉదయం నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు. తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలు ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడుతోంది. శివాలయాలను కూడా వివిధ రకాల విద్యుత్ లైట్లు, పుష్పాలు, సుందరంగా అలంకరించారు. మండలంలోని రాయలచెరువు కట్ట దిగువున ఉన్న శివాలయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేశారు, ఆలయంలో ఉన్న 108 శివలింగాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయ అర్చకులు. మండల తాసిల్దార్ వెంకటరమణ దంపతులు స్వామివారిని దర్శించుకుని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ నిర్వహకులు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం చేపట్టారు.
