

క్రిప్టాన్ ఫిట్నెస్ జిమ్ ఆధర్వంలో ఈనెల 23 తేదిన మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ను బైపాస్ రోడ్డులో నిర్వహిస్తామని ఆర్గనైజర్ డి.వెంకీ,అర్.దుర్గ ప్రసాద్ తెలిపారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలలో రాష్ట్రం లోని అన్ని జిల్లా ల నుంచి పాల్గొనవచ్చని తెలియజేశారు. బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి గా రూ.50వేలు, రెండో బహుమతి రూ.20వేలు, మూడవ బహుమతి రూ.10 వేలు చొప్పున బహుమతులు ఉంటాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలో ఉన్న బాడీ బిల్డర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
