
తెలంగాణ, మునుగోడు గరుడ న్యూస్ (ప్రతినిధి): మహిళల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళా మణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి.మహిళా సాధికారత సాధనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని,మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.గ్రామీణ,పట్టణ మహిళలను,యువతులను,వృద్ద మహిళలను ఒకే గొడుగు కిందకు చేర్చి,ఆర్థిక స్వాంతంత్య్ర,నైపుణ్యాభివృద్ధి,శిక్షణ ద్వారా వారిని శక్తివంతం చేయాలనే సంకల్పంతో కోటి మంది మహిళలను సంఘటితం చేసి,వారందరిని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ – 2025,కు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని,ఇందిరా మహిళా శక్తి బస్సు పథకంలో భాగంగా మండల మహిళా సమైక్య సంఘాల ద్వారా 600 బస్సులను కొనిపించి,వాటిని అద్దె ప్రాతిపదికన ఆర్టీసీలో నడిపిస్తూ మహిళా సంఘాలకు అద్దె చెల్లిస్తూ బస్సుల కొనుగోలుకు ప్రభుత్వమే రుణాలు సమకూర్చనుందన్నారు.ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్,రూ.10 లక్షల ప్రమాద బీమా వంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలతో మహిళా సంక్షేమంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు.రాష్ట్ర మహిళా మణు లతోపాటు మునుగోడు నియోజకవర్గ ఆడపడుచులందరికి ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

