K. మల్లికార్జున రెడ్డి, గరుడ న్యూస్ ప్రతినిధి: చిత్తూరు జిల్లా బోయకొండలో వెలసిన శక్తి స్వరూపిణి మూలస్థాన బోయకొండ గంగమ్మ శుక్రవారం ప్రత్యేక పూల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అఋచకులు చందు స్వామి సేకరించిన తామర పువ్వులు (పద్మములు) తో గజమాలను తయారుచేసి అభిషేకానంతరం అమ్మవారికి అలంకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అందరికీ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద నిర్వహించిన అన్న ప్రసాదంను భక్తులు స్వీకరించి వెను తిరిగి వెళ్లారు. భక్తులకు అమ్మవారి పవిత్ర కుంకుమ పూలు పళ్లు కుంకుమ అర్చకులు పంపిణీ చేశారు.