
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాఫ్ రిపోర్టర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి10,(గరుడ న్యూస్ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైన విజయ్ శాంతి ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు రహీమ్ షరీఫ్. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే కోటాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయ్ శాంతి నీ ఖరారు చేయడంతో వారు నామినేషన్ పత్రాలను సమర్పించడం కోసం శాసన సభలోకి రావడం సందర్భంగా వారిని మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు ఎండీ రహీం షరీఫ్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమరాలు అయినటువంటి విజయ్ శాంతి కి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఖరారు చేయడంతో ఒక మహిళను శాసన మండలి కి ఎన్నిక చేయడం ద్వారా మహిళల గౌరవం మరింత ఎక్కువగా ఉన్నత స్థానంలో నిలబెట్టినందుకు అధిష్టానానికి,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియచేశారు.

