సాలూరు పురంలో చలో పిఠాపురం పోస్టర్ ఆవిష్కరణ.

Panigrahi Santhosh kumar
1 Min Read

గరుడ న్యూస్,సాలూరు

జనసేన పార్టీ ఆధ్వర్యంలో మార్చి 14న పిఠాపురం చిత్రాడ వద్ద అతి వైభవంగా నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు పెద్ద ఎత్తున జన సైనికులు తరలి రావాలని,ట్రాఫిక్ నియమాలు పాటించాలని,సభను దిగ్విజయం చెయ్యాలని కోరారు.సాలూరు లో శ్రీ సత్యసాయి కాలేజ్ దారి లో శ్రీ సీతారామ కళ్యాణ మండపం లో మంగళవారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలోసాలూరు జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్ధి కి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నేతలు జరజాపు సూరిబాబు,జి.టి.నాయుడు,రాపాక మాధవరావు, వరప్రసాద్,పిల్లా మురళీ, పప్పలలక్ష్మణరావు,గోపి, పరశురామ్ గరికపాటిసంతోష్,రౌతు సత్యనారాయణ,వెంకటేష్, అవ్వ సంతోష్, గౌడు పండుతో పాటు యువత అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

- Advertisement -
Ad image

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *