తిరుపతి జిల్లా, పాకాల గరుడ న్యూస్ (ప్రతినిధి):
గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలపై సమీక్ష
గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న ఆరోగ్య సేవలపై డీపీఎంవో శ్రీనివాసులు మంగళవారం సమీక్ష నిర్వహించారు. దామలచెరువు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించిన ఆయన గర్భవతులు, బాలింతలకు అందిస్తున్న సేవలతో పాటు చిన్నపిల్లల టీకాల వివరాలను పరిశీలించారు. క్షేత్రస్థాయి పురోగతి వివరాలను ఆశాలు, ఏఎన్ఎంలు ఈ-యాప్ లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వైద్యాధికారి రవిరామ్,డీపీవో ప్రకాష్,పర్యవేక్షకులు నరేష్బాబు, అంజలీదేవి, గణాంకాధికారి నాగేంద్రకుమార్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.