
గరుడ న్యూస్,సాలూరు
సాలూరు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా గాదే శ్రీనివాసుల నాయుడు ఘనవిజయం సాధించాక సాలూరు విచ్చేశారు. సాలూరు పట్టణ పరిధిలో వేద సమాజం స్కూల్ లో సమావేశంలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల ఉపాధ్యాయు సంఘ నేతలు,ఉపాధ్యాయులు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ను ఘనం గా సన్మానించారు.

