
గరుడ న్యూస్,సాలూరు ప్రతినిధి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాలూరు పట్టణ వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. తదుపరి స్థానిక బోసు బొమ్మ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనను గుర్తు చేసుకున్నారు.యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో హాజరై సంబరాలు చేసుకున్నారు.

