చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్కి చిరు వ్యాపారుల వినతి

Panigrahi Santhosh kumar
1 Min Read



రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,చౌటుప్పల్,మార్చ్12,(గరుడ న్యూస్ ప్రతినిధి):

చౌటుప్పల్ చిరు వ్యాపారుల అధ్యక్షులు బోదుల యాదగిరి,కోశాధికారి ముత్యాల గణేష్ కుమార్ ఆధ్వర్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.విషయం గత 30 సంవత్సరాలుగా సర్వీస్ రోడ్లో పండ్లు కూరగాయలు బట్టలు ప్లాస్టిక్ సామాన్ ఇలా నిత్యవసర వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వేస్తుడంతో చిరు వ్యాపారులకు ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పడం జరిగినది.అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనం సాధిస్తున్నాం వ్యాపారం చేసుకుంటూఉన్నాము. అకారణంగా మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లగొడితే ఎక్కడికి పోయి బతకాలి మాకంటూ స్థలం చూపించాలి మేము వ్యాపారం చేసుకోవడానికి అని చిరు వ్యాపారుల అధ్యక్షులు బోదుల యాదగిరి,వ్యాపారస్తులందరూ చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.కమిషనర్ సానుకూలంగా స్పందించి స్థానిక ఎమ్మెల్యే తో కలెక్టర్ తో చర్చించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారుల సంఘం ఉపాధ్యక్షులు మొహమ్మద్ చాంద్ పాషా,ఉపాధ్యక్షులు పింజర వినోద్,పాలకూర వెంకటేష్,సలహాదారులు అల సేరి బాలరాజు,బీరప్ప,రామచంద్రయ్య, బక్క చంద్రయ్య,భారతమ్మ,శంకరమ్మ,పారిజాత,శ్రీను,మల్లేష్,యాదయ్య,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *