ఇటుక బట్టీల వ్యాపారుల వల్ల లక్షలాది రూపాయలు నష్టపోతున్న ప్రభుత్వం.

Srinivas Nayak
4 Min Read


కూలీల శ్రమను దోచుకుంటున్న ఇటుక బట్టీల వ్యాపారాలు. ఇటీవల వరుస కథనాలతో “నిజం చెబుతాం” దినపత్రికలో వార్తా కథనాలు వెలబడ్డాయి.
పలు పత్రికలలో ఇటుక బట్టి వ్యాపారులపై పలు కథనాలు వెలు వడ్డ సంబంధిత ఒక్క జిల్లా అధికారి కూడా స్పందించలేదు. ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో గండిపడుతున్నా నోరు మెదపని జిల్లా సంబంధిత ఉన్నతాధికారులు.
ప్రభుత్వాన్ని, అమాయక కోయ గిరిజనులను మోసం చేస్తూ ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న వీరిని అడ్డుకునే అధికారులు లేరా?. ప్రస్తుతం బయ్యారం పెద్ద చదువు నుండి అర్ధరాత్రి టిప్పర్లతో, ట్రాక్టర్లతో ఇటుకలు తయారు చేసే మట్టిని దొంగతనం గా తోలుతున్న మాకెందుకులే అని సంబంధిత ఉన్నత అధికారులు నోరు మెదపడం లేదు. కాలు కదపటం లేదు.
లేక సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులకు ఎవరికి ముట్టే అమ్యామ్యాలు వారికి మూడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు వీరిపై చర్యలు తీసుకుంటారా?.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చి 12,( గరుడ న్యూస్).
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలం నుండి నామాలపాడు వరకు రోడ్డుకు ఇరువైపులా గిరిజనేతరులు ఇటుక బట్టీలు పెడుతూ, అటు ప్రభుత్వానికి, ఇటు అమాయక గిరిజన కోయలను మోసం చేస్తూ, కోట్లాది రూపాయలు గడిస్తున్నారు. బయ్యారం మండలం మొదలుకొని నా మాలపాడు వరకు సుమారు రోడ్డు ప్రక్కన 50 వరకు ఇటుక బట్టీలు ఉన్నాయి. ఈ బట్టిలను కాలుస్తున్నప్పుడు వెలబడుతున్న కాలుష్యం రోడ్డుపైన వెళ్లే బస్సులకు లారీలకు ఇతర ద్విచక్ర వా హనం వాహనాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటుక బట్టీలు కాల్చేటప్పుడు వచ్చే పొగ పీల్చడం వలన శ్వాసకోశ రోగాలు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో గండి.
ఒక ఇటుక బట్టి పెట్టాలి అని అనుకున్నప్పుడు సంబంధిత అధికారుల అనుమతులు తప్పనిసరి. ఇటుక బట్టీల తయారీకి మట్టి ముఖ్యం ఈ మట్టిని సంబంధిత చెరువుల నుండి తీసి తోలుకుంటారు. దీనికి నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖ వారు అనుమతి ఇవ్వాలి. అలాగే ట్రైబల్ యాక్ట్ ప్రకారం ఏజెన్సీ ఏరియా లో గిరిజనేతరులు ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి సంబంధిత గిరిజన కోయల కు సంబంధించి వారు పంటలు పండించుకునే భూములను అతి తక్కువ ధరకు లీజుకు తీసుకొని అటు గిరిజన కోయలను కూడా మోసం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వాన్ని, అటు అమాయక గిరిజన కోయలను, వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా గిరిజనేతరులు కోట్లాది రూపాయల ఇటుక వ్యాపారo చేస్తున్నారు. జిల్లాలోని పలు పత్రికలు గిరిజనేతరులు చేస్తున్న అక్రమ ఇటుక బట్టీల వ్యాపారాన్ని సాక్షాలతో ప్రచారం చేస్తున్న సంబంధిత జిల్లా అధికారులు కానీ, రాష్ట్ర అధికారులే కానీ “నిమ్మకు నీరెత్తినట్లు”ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బయ్యారం మండలం నుండి నామాలపాడు చివరకు ఇల్లెందు వరకు గత 20 సంవత్సరాల నుండి గిరిజన యాక్టివ్ ఉన్న గిరిజనేతరులు ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఏజెన్సీలోని ట్రైబల్ ఆక్ట్ కు విరుద్ధంగా ట్రైబల్స్ కి వ్యతిరేకంగా, వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకునీ అటు ప్రభుత్వానికి ఇటు అమాయక గిరిజన కోయలను గిరిజనేతరులు మోసం చేస్తున్నారు.
అర్ధరాత్రి బయ్యారం పెద్ద చెరువు నుండి ఇటుకల తయారీకి మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తోలుతున్న సంబంధిత అధికారులు చోద్యం చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఒకరిద్దరు కోయల ద్వారా ప్రభుత్వం వద్ద నుండి పర్మిషన్లు తీసుకుని ఆ పర్మిషన్ల మీదనే సుమారు 40 బట్టిల వరకు నడుస్తున్నవి. దీనివలన ప్రభుత్వ ఆదాయం పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది. సంబంధిత గ్రామపంచాయతీలకు రావలసిన రాయితీలు కూడా ఎగకొట్టే ఘనులు ఈ గిరిజనేతరులు. ఒక్కొక్క బట్టి యజ మాని తను బట్టిలను నుండి 20 లక్షల నుండి 80 లక్షల వరకు ఇటుకలు తీస్తున్నారు. ఈ విధంగా సుమారు 50 ఇటుక బట్టీల వరకు ఉన్న ఈ బట్టీలకు ఎన్ని లక్షల ట్రిప్పుల మట్టిని తోలుతున్నారో ఊహించుకోవచ్చు. ఈనాటి వరకు ఒకరిద్దరూ ఎస్టీలకు తప్ప కొత్తపేట, నామాలపాడు పంచాయతీలో ఎవ్వరికి ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని ఇరిగేషన్ రెవెన్యూ గ్రామపంచాయతీ అధికారులు వివరణ వివరణ ఇవ్వడం జరిగింది. ఒక బట్టి ఉంది ఒక లక్ష ఇటిక తీస్తే దాని ధర ఆరు లక్షల 30 వేల రూపాయలకు అమ్ముతున్నారు.
ఇటుక బట్టీలలో పనిచేసే అమాయక లేబర్ ను మోసం చేస్తున్న విధానాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఒరిస్సా ఛత్తీస్గడ్ల నుండి లేబర్ను తీసుకొచ్చి వారికి ఎటువంటి అనుమతులు లేకుండా దొంగతనంగా ఇక్కడికి తీసుకు వచ్చి వారిని ఇటుక తీసేందుకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా, వారికి సక్రమమైన సదుపాయం కల్పించకుండా, అరా కొర గుడిసెలు వేసి వాళ్లను అందులో నివాసం ఉంచి వారి పిల్లలతో సహా చిన్నపిల్లలు అనే వివక్ష లేకుండా వారితో కూడా వెట్టిచాకిరి చేయిస్తూ గత 20 సంవత్సరాల నుండి కోట్లు గడిస్తున్న గిరిజనేతరుల ఇటుక బట్టీల వ్యాపారం “మూడుపూలుఆరుకాయలుగా” విరాజుల్లుతుంది. సంబంధిత జిల్లా కలెక్టర్, మైనింగ్ ఏడి, రెవెన్యూ తహసిల్దార్, పొల్యూషన్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. అడవికి ఆనుకొని ఉన్న బట్టీలలో అర్ధరాత్రి అడవి నుండి కర్రతోలుతూ బట్టీలలో కాలుస్తున్నారు. దీనిపై సంబంధిత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించడం లేదో వారికే తెలియాలి. కోయ గిరిజనులమైన మా అమాయకత్వా న్ని ఆసరా చేసుకుని గిరిజనేతరులు మా పంట భూములను అతి తక్కువ ధరలకు కౌలుకు తీసుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్న వారి పైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. లేనియెడల మానవ హక్కుల కోర్టుకు, సివిల్ కోర్టులను ఆశ్రయిస్తామని బయ్యారం మండల గిరిజనులు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *