సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేపట్టిన మాన్యం ఎస్పి

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
1 Min Read

అక్రమరవాణా (గంజాయి,మద్యం) నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి,ఐపిఎస్  బుధవారం  సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసారు.  ప్రాక్టికల్ శిక్షణ నిమిత్తం సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్ కేటాయించిన ప్రొబేషనరీ ఎస్సైలతో సమవేషమయ్యి  నిర్వర్తిస్తున్న విధుల గురించి అడిగి తెలుసుకున్నారు, తరుచూ గ్రామాలను సందర్శించాలని, ముఖ్యంగా ఏజెన్సీ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాలను సందర్శించాలని,  ప్రజలతో సమావేశం అయి వారితో మమేకమై వారికీ సైబర్, నక్షలిజమ్, మత్తుపదార్దాల, నాటుసారా వల్ల కలిగే దుష్ప్రభావాలు గరించి అవగాహన కల్పించాలన్నారు. ROP/కూంబింగ్ ఆపరేషన్ లు గురించి తెలుసుకొని నిర్వహించాలని చుట్టూ పక్కల ఏజెన్సీ(ఎక్ష్త్రెమిస్ట్ ప్రభావిత) ప్రాంతాలలో సంచరించే దళాల గురించి, వారికీ సహయం చేసేవారి గురించి వివరాలు, మునుపటిగా జరిగిన సంఘటనలు గూర్చి తెలుసుకోవాలన్నారు. స్టేషన్ కి న్యాయం దక్కుతుందని ఆశతో పిర్యదుదారులు వస్తారని,వారితో సామరస్యంగా మెలిగి వారి సమస్యలను పరిష్కరించాలని,నాఖబంది విధులు ఇతర స్టేషన్ విధుల గురించి క్షుణ్ణంగా ఈ ప్రాక్టికల్ శిక్షణ కాలమందు నేర్చుకోవాలని తెలియజేసారు. అదేవిధంగా స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఫిర్యాదుదారులను కలిసి వారి సమస్యను అడిగి తెలుసుకొని,వారి సమష్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా ఎస్పీ  ఆదేశించారు.

అనంతరం పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిది హైవే దగ్గరలో గల చిన్న చిన్న రహదారులు మాతుమూరు,అలూరు గ్రామాల రహదారుల గుండా ఒరిస్సా నుండి,ఇతర ప్రాంతాల నుండి ప్రయాణించే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని,అక్రమరవాణా (గంజాయి,మద్యం) నియంత్రించేందుకు గట్టి చర్యలు చేపట్టాలని అధికారులని జిల్లా ఎస్పీ  ఆదేశించారు. ఈ సందర్శనలో ఎస్పీ తో పాటుగా సాలూరు పట్టణ సిఐ అప్పలనాయుడు, సాలూరు రూరల్ సర్కిల్ సిఐ రామకృష్ణ, సాలూరు రూరల్ ఎస్సై నరసింహమూర్తి, పాచిపెంట ఎస్సై వెంకట సురేష్, ప్రొబేషనరీ ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *