
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్, మార్చి13,(గరుడ న్యూస్ ప్రతినిధి)
ఐఎన్టియుసి చౌటుప్పల్ చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షులు బోదుల యాదగిరి,ఉపాధ్యక్షులు మహమ్మద్ చాంద్ పాషా,కోశాధికారి ముత్యాల గణేష్ కుమార్,ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో చిరు వ్యాపారుల సంఘం సభ్యులు కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.గత 30 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు హైవే రోడ్డు ఇరువైపులా పండ్లు కూరగాయలు బట్టలు ప్లాస్టిక్ మొదలవు వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కారణంగా అకారణంగా వారి బండ్లని రోడ్డు వారు తీసేయమని చెప్పడం జరిగినది.దిక్కు తోచక ఈరోజు కలెక్టర్ దగ్గరికి దాదాపు 150 మందితో కలెక్టర్ వద్దకి వెళ్లి వారి బాధలు వ్యక్తం చేయడం జరిగినది.కలెక్టర్ స్పందించి చౌటుప్పల్ స్థానిక మున్సిపల్ కమిషనర్ ని ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకొని అదేవిధంగా స్థానిక మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఇట్టి విషయాన్ని దృష్టికి తీసుకెళ్లి మీకు తగిన న్యాయం చేస్తామని అదేవిధంగా మీకు ఎంట్రీ గేట్ మార్కెట్ నిర్మాణ దశలో ఉంది కాబట్టి సాధ్యమైనంత త్వరగా మీకు ఆ మార్కెట్ కంప్లీట్ చేసి అందులో మీకు వ్యాపారం చేసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తాం అన్నారు.అంతవరకు బస్టాండ్ ఆవరణ లో లేదా చౌటుప్పల్ మున్సిపల్ ఆఫీస్ పక్కన ఎంట్రీ గ్రేడ్ మార్కెట్ కంప్లీట్ అయ్యేవరకు వ్యాపారం చేసుకునే విధంగా ఎమ్మెల్యే తో మాట్లాడి నేను మీ దగ్గరికి వచ్చి స్థలం పరిశీలిస్తాం అని హామీ ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారులు,ప్రజలు పేతురులు పాల్గొన్నారు.

