

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి13,(గరుడ న్యూస్ ప్రతినిధి):
నేడు హోళీ పండుగను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీస్ పార్టీ సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి మండల ప్రజలకు రంగుల పండుగ హోళీ శుభాకాంక్షలు తెలియజేశారు.రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.మండల ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుకలు జరుపుకోవాలని సూచించారు.కెమికల్ రంగులను వాడకుండా సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.

