*మెర్లపాలెం గ్రామంలో పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు..

Sesha Ratnam
1 Min Read

ఉభయగోదావరి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆత్రేయపురం మండలం మెర్లపాలెం శివారు వాసంశెట్టివారిపాలెంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 24 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రామస్థులు సేకరించి పనులు పూర్తి చేసి పాఠశాలను సిద్ధం చేసిన వారిని అభినందించారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలకు అవసరమైన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు త్వరిగతిన పనులు పూర్తి చేస్తామని సత్యానందరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె వి సత్యనారాయణ రెడ్డీ, ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ), గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, అయినవిల్లి సత్తిబాబు గౌడ్, మెర్ల రాము, మలవరపు నాగరాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *