
ఉభయగోదావరి జిల్లా, గరుడ న్యూస్ (ప్రతినిధి): ఆత్రేయపురం మండలం మెర్లపాలెం శివారు వాసంశెట్టివారిపాలెంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 24 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రామస్థులు సేకరించి పనులు పూర్తి చేసి పాఠశాలను సిద్ధం చేసిన వారిని అభినందించారు.విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పాఠశాలకు అవసరమైన కాంపౌండ్ వాల్ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు త్వరిగతిన పనులు పూర్తి చేస్తామని సత్యానందరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కె వి సత్యనారాయణ రెడ్డీ, ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ), గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, అయినవిల్లి సత్తిబాబు గౌడ్, మెర్ల రాము, మలవరపు నాగరాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

