విద్యార్థి దశ నుండి ఆత్మరక్షణ పెంపొందించుకోవాలి..కొత్తపేట ఎస్ ఐ జి.సురేందర్..

Sesha Ratnam
1 Min Read

ఉభయ గోదావరి జిల్లా, కొత్తపేట, గరుడ న్యూస్ (ప్రతినిధి ): విద్యార్థి దశ నుండి ఆత్మరక్షణ పెంపొందించుకోవాలని కొత్తపేట ఎస్సై జి సురేందర్ అన్నారు. ఈనెల 8 వతేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఎస్సై జి సురేందర్ పిలుపుమేరకు మహిళలకు ఆత్మరక్షణ కై అవగాహన కార్యక్రమం స్థానిక భాష్యం స్కూల్ నందు జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎస్సై జి సురేందర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్సై సురేందర్ మాట్లాడుతూ విద్యార్థి, విద్యార్థునులు చిన్నతనం నుండి విద్య తో పాటు ఆత్మరక్షణ పెంపొందించుకోవాలని అన్నారు. ముఖ్యంగా మహిళలు మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకొని ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని ఎస్సై సురేందర్ సూచించారు. విద్యార్థునులకు సమాజంలో తీసుకోవలసిన జాగ్రత్తలను మెలకువలను తెలియజేశారు. ఈ సందర్భంగా భాష్యం స్కూల్ లో మార్షల్ హార్స్ లో శిక్షణ పొందుతున్న విద్యార్థునులు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ యం.లోకేశ్వరరావు, చాంప్స్ ప్రిన్సిపాల్  ఎన్.రమాజ్యోతి, కోచ్ జి. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *