
గరుడ న్యూస్,సాలూరు
స్త్రీ శిశు సంక్షేమ శాఖ,గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ కొనసాగింది. పార్వతీపురం మన్యం జిల్లా బిజెపి అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ప్రముఖ డాక్టర్,బిజెపి నాయకులు అరకు పార్లమెంట్ హేమ నాయక్, పేర్ల విశ్వేశ్వరరావు, సాలూరు పట్టణం బిజెపి అధ్యక్షులు వానపల్లి మురళీకృష్ణ తోపాటు పలువురు బలనేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆద్వర్యంలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు కోరుతున్నారు.

