
గరుడ న్యూస్, పాచిపెంట
మండలంలో ఇప్పటివరకు 11 మంది రైతులుతో 20 టన్నుల టైప్ టు ఘన జీవామృతం తయారు చేయటం జరిగిందని వ్యవసాయ అధికారి కే. తిరుపతిరావు అన్నారు. తాడూరు గ్రామంలో రైతు డి రాము రెండు టన్నుల టైప్ టు ఘన జీవామృతం తయారీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పెంట గెత్తము కుప్పలు ఉన్న రైతులందరూ 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని తయారు చేసుకుని ఒక టన్ను పశువుల పెంటలో కలుపుకుని పొలంలో ఆఖరి దుక్కిలో వేసుకున్నట్లయితే నేల అత్యంత సారవంతంగా మారుతుందని పంటకు కావలసిన సూక్ష్మ, స్థూల పోషకాలను అందిస్తుందని భూమిలో జీవ వైవిధ్యము పెరిగి వానపాముల వృద్ధి జరగడం వలన నీటి తేమ శాతాన్ని నిలుపుకునే శక్తి పెరుగుతుందని అలాగే భూసారముగా పిలవబడే సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని తెలిపారు. చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాన్ని పరిశీలిస్తూ నాడెపు కంపోస్ట్ గుంతలలో కేవలం పశు, వృక్ష వ్యర్ధాలను మాత్రమే వేయాలని ప్లాస్టిక్, పాలిథిన్ ఎట్టి పరిస్థితులలో వేయకూడదని దీనివలన పశువుల పెంటలో ఉపయోగపడే జీవ వైవిధ్యం నశించిపోతుందని తద్వారా తయారుచేసిన ఎరువు పంటకు ఉపయోగపడకుండా పోతుందని కాబట్టి రైతులు కేవలం చివికిన పశు, వృక్ష వ్యర్ధాలను మాత్రమే నాడెపు గుంతలలో వేయాలని సూచించారు అనంతరం మెలియా కాంచూరు గ్రామంలో గ్రామీణ ఉపాధ హామీ పథకంలో తవ్వించిన కంపోస్టు గుంతను పరిశీలించారు. పశువుల పేడను చివికిన ఆకులు రొట్ట వంటి వాటిని ఈ కంపోస్టు గుంతలో వేసుకుంటే సారవంతమైన ఎరువు తయారవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు దినేష్ కుమార్, అనిల్ కుమార్, ప్రకృతి సేద్య యల్ వన్ తిరుపతి నాయుడు రైతులు పాల్గొన్నారు.

