
- వేసవి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
వారానికి, పది రోజులకు కుళాయిలు ఇచ్చే తీరు మారాలి
- ముక్కు పిండి వాటర్ టాక్స్ వసూలు చేస్తున్నారు
తాగు నీరివ్వటంలో అలసత్వమెందుకు
- బలిజిపేట మండలం తుమరాడ, బర్లి గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలి జిల్లాలో నీటి ఎద్దుల లేకుండా చర్యలు చేపట్టాలి
*తాగునీటి కుళాయిలు విడుదలలో సమయపాలన పాటించాలి
సబ్ కలెక్టర్ ని కోరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

పార్వతీపురం మున్సిపాలిటీలో ప్రతిరోజు కుళాయి నీరివ్వాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఓ బి సి జిల్లా చైర్మన్ వంగల దాలి నాయుడు, మండల అధ్యక్షులు తీళ్ల గౌరీ శంకరరావు, ఆ పార్టీ నాయకులు కోలా కిరణ్ కుమార్ తదితరులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవను కలిసి పార్వతీపురం మున్సిపాలిటీని వేధిస్తున్న తాగునీటి సమస్యపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తిన మోహన్ రావు ఆదేశాల మేరకు నిర్వహించమన్నారు. ఈ సందర్భంగా వారు సబ్ కలెక్టర్ తో మాట్లాడుతూ పార్వతీపురం మున్సిపాలిటీలో వారానికి, పది రోజులకొకసారి కుళాయిలు వస్తున్నాయన్నారు. దీంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం వేసవి ప్రారంభం కావడంతో ఆ ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయన్నారు. కాబట్టి వేసవి అద్దటి లేకుండా ప్రతిరోజు కుళాయిలో తాగునీరు ఇవ్వాలన్నారు. ప్రజల నుండి ముక్కు పిండి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, తాగునీరు ఇవ్వటంలో ఎందుకు అంత అలసత్వమని ప్రశ్నించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో సక్రమంగా మీరు ఇవ్వటం లేదన్నారు. సమయపాలన లేకుండా కొద్దిసేపు మాత్రమే ఇస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇచ్చే నీరు కూడా కొన్ని ప్రాంతాల్లో కలుషితమై వస్తుందన్నారు. క్లోరినేషన్ చేసిన శుద్ధమైన నీటిని కుళాయిల్లో ప్రతిరోజు విడుదల చేయాలన్నారు. తక్షణమే తగు చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే బలిజిపేట మండలంలో తుమరాడ, బర్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. జిల్లాలో వేసవి అద్దులు లేకుండా తాగునీరు అన్ని గ్రామాలకు పుష్కలంగా ఇవ్వాలన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కలుషితం కాని శుద్ధమైన తాగునీటిని జిల్లా ప్రజలకు అందివ్వలన్నారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు. దీనికి స్పందించిన సబ్ కలెక్టర్ మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
