
గరుడ న్యూస్,సాలూరు
శాసనసభ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ ను శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇతర శాసనసభ్యులు అందరూ పాల్గొనారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి పాల్గొనటం సంతోషకరం. మన రాష్టానికి సంబంధించిన అరకు కాఫీకి ప్రాచుర్యం కల్పించటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ఎనలేనిది…మన గిరిజన ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఆయనకు శతకోటి ధన్యవాదాలు….

