అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై గలమెత్తిన  ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర

Sivaprasad Patro
Sivaprasad Patro - Staff reporter
2 Min Read

దళిత పక్షపాతి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఇది పేదల ప్రభుత్వం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాన్ని నిలబెడుదాం

ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

- Advertisement -
Ad image

ఎస్సీ వర్గీకరణ వల్ల సమన్యాయం జరుగుతుంది

దేశంలో ప్రతి ఒక్కరూ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నతి సాధించాలంటే సంకల్పం ఉండాలని చెప్పింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అని, ఆయన ఆలోచన విధానాలను మనం ఆదర్శంగా తీసుకోవాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఈ సందర్భంగా జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడగుజాడల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నడుచుకుంటూ దళిత పక్షపాతి సీఎం అని నిరూపించుకున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ తప్పనిసరిగా జరగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ వర్గాలకు ఎటువంటి అన్యాయం జరగనివ్వమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అనేది ఒక ఉద్యమంలో ప్రారంభమైందని అన్నారు. ఈ ఉద్యమంలో చాలామంది బలిదానాలు ఇచ్చారని, ఈ బలిదానాలు కూడా వాళ్ల గురించి వాళ్లు ఇచ్చుకోలేదని భవిష్యత్ తరాల కోసం అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు పూర్తిస్థాయిలో రిజర్వేషన్ కల్పించడమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయమని, అది నేటికి నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి క్యాటగిరి ఉన్నతి స్థాయికి ఎదగాలనదే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయమని, అందరూ ఒక తల్లి బిడ్డల ఉండాలని ఆయన ఆకాంక్షని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. అంబేద్కర్ ఆశాలను నెరవేరుస్తూ వర్గీకరణ ఉన్న అన్ని కులాలకు సమన్యాయం జరగాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అని ఈ అసెంబ్లీ సాక్షిగా తెలియజేస్తున్నానని అన్నారు. ఎస్సీ వర్గీకరణ పై అభిప్రాయం తెలిపేందుకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *