
తిరుపతి,శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అఖిల భారత సమన్వయ కోళ్ల పరిశోధన ప్రాజెక్టు లో భాగంగా రెండవ దశలో ఊరందూరు హరిజనవాడలో 32 మంది ఒక్కొక్కరికి 8 వనరాజ కోళ్లు, దాణా, మందులు, నీటి తొట్టె, పంజరంను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి డీన్ డాక్టర్ వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ పరిశోధన ఫలాలు రైతుల వద్దకు చేర్చడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పెరటి కోళ్ల పెంపకం ద్వారా తక్కువ ఖర్చుతో జీవనోపాధి, పోషకాహారం లభ్యమవుతుందన్నారు.

తిరుపతి పశువైద్య కళాశాల అసోసిమేంట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య మాట్లాడుతూ వన రాజా కోళ్లు అధిక వ్యాధి నిరోధక శక్తిని కల్గివుంటాయన్నారు.ప్రతికూల వాతావరణ పరిస్థితులు ను తట్టుకునే శక్తి ఎక్కువగా వుంటుందన్నారు.
కోళ్ళ శాస్త్ర విభాగధిపతి డాక్టర్ షకీలా మాట్లాడుతూ ఆర్ధిక లాభాల కొరకు కోడి పెట్టలను ఒకటిన్నర సంవత్సరం, కోడిపుంజులను 14 లేదా 16 వారాల వయస్సు వచ్చే వరకు పెంచాలన్నారు.ఒక కోడి పెట్ట నుండి ఒక సంవత్సరంలో 160 గుడ్లు లభ్యమవుతాయన్నారు.
ప్రొఫెసర్ రాంబాబు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ N.V శ్రీకాంత్ బాబు, ఊరందూరు డాక్టర్ ఊహ, అసిస్టంట్ ప్రొఫెసర్ డాక్టర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.