

450 మంది హాజరు
బలిజిపేట మండలంలో పదో తరగతి పరీక్షలు మూడవ రోజు ప్రశాంతంగా జరిగినట్లు మండల విద్యాశాఖ అధికారి 1 సామల సింహాచలం తెలిపారు.
శుక్రవారం ఆయన మండలంలోని వంతరాం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వంతరాం పరీక్షా కేంద్రం లో 163 మందికి 162 మంది హాజరు కాగా, ఒక విద్యార్థి గైర్హాజరయ్యారని తెలిపారు. బలిజిపేట ఎ కేంద్రంలో 150 మంది, బి కేంద్రంలో 138 మంది మొత్తం 450 మంది విద్యార్ధినీ విద్యార్ధులు పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు, పూర్తిస్థాయిలో ఫర్నిచర్, ఫ్యాన్స్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా వైద్య సిబ్బందిని కూడా పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు ఎంఈవో తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం
లేకుండా స్థానిక ఎస్సై వై సింహాచలం ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసామన్నారు. మూడవ రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎంఈవో సామల పేర్కొన్నారు.
