ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమయం మార్పు..

Sesha Ratnam
1 Min Read

తిరుపతి జిల్లా, పాకాల-గరుడ న్యూస్ (ప్రతినిధి): మార‌్చి22: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సమయాన్ని మార్పు చేసినట్లు పాకాల తాశీల్దార్ సంతోష్ సాయి చెప్పారు. మండల తాశీల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఎండలు విపరీతంగా ఉండటం వలన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు సమయం మార్పు చేశామన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మండల ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి తదననుగుణంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అధికారులు తప్పని సరిగా మండల రెవెన్యూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని చెప్పారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *