
మానుకోట కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది?…
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమా లు ప్రజల్లోకి ఎందుకు వెళ్లడం లేదు. నిద్రవస్థలో మానుకోట కాంగ్రెస్.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ఏ మెరుగనిపిస్తుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మానుకోటలో మళ్లీ టీఆర్ఎస్ వచ్చే పరిస్థితిలో ఉందా?.
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పట్టణంలో ఎక్కడ జరిగిన పట్టుమని 100 మంది కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా హాజరు కాని పరిస్థితి. _10 సంవత్సరాలు మానుకోట ఎమ్మెల్యేగా పరిపాలన చేసిన మాజీ ఎమ్మెల్యే వస్తే వందలాదిమంది కార్యకర్తలు ఆయన వద్దకు వస్తా రు. మాజీ ఎమ్మెల్యే కాలంలో క్యాంప్ ఆఫీసు నుండే కార్యకలాపాలు నిర్వహించేవారు.
ఆనాటి రోజులలో క్యాంప్ ఆఫీస్ కార్యకర్తలతో, కళకళలాడుతూ ఉండేది. ఈనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే హయాంలో క్యాంప్ ఆఫీస్ లో కార్యకర్తలు, నాయకులు లేక వేలవేల పోతున్న క్యాంప్ ఆఫీస్.
మాజీ ఎమ్మెల్యే పట్టణంలో ఏదైనా ప్రోగ్రాం పెడితే బిఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే తో వందల సంఖ్యలో పాల్గొని ఫాలోయింగ్ లో ఉంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తే మాజీ ఎమ్మెల్యే 50 వేల పై చిలుకు ఓట్లతో గెలుస్తా డని రాజకీయ పరిశీలన అంచనా!.
కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే, కార్యకర్తలు, రెండవ శ్రేణి నాయకుల అభిప్రాయం ప్రకారం రాబోయే మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలలో పార్టీ పరాజయం తప్పదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమకు ఓర్చి పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తమను చూసే నాధుడే లేడని పార్టీలోని కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులు వా పోతున్నారు.
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చి 23,( గరుడ న్యూస్).
మహబూబాబాద్ నియోజకవర్గ o లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరమునరలోపే కిందిస్థాయి కార్యకర్తల్లో, రెండవ శ్రేణి నాయకుల్లో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలలో పార్టీ ఘోరంగా దెబ్బతినే పరిస్థితి ఉందని రాజకీయ పరిశీలకుల అంచనా. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర పార్టీలు ఇచ్చే ఆదేశాలను పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో అమలు చేయించడంలో విఫలం చెందుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఉండకపోవడం వల్ల వివిధ పనులకు వచ్చే గ్రామీణ ప్రాంత, మండల ప్రాంతం కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహంతో వేను తిరుగుతున్నారనీ కిందిస్థాయి కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు. ఇప్పటివరకు మాకు ఎలాంటి పనులు కావడం లేదని, పార్టీకిఎంతో కష్టపడి పార్టీని గెలిపించుకుంటే తమకు ఎలాంటి పనులు కావడం లేదనీ తమ బాధలు వ్యక్తం చేస్తున్నారు. గత పది సంవత్సరాలు పరిపాలన సాగించిన మాజీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులోనే నివాసం ఉంటూ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు అర్ధరాత్రి కూడా అందుబాటులో ఉండే వాడని కాంగ్రెస్ కార్యకర్తలు బాహటంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎక్కువ శాతం ఉండకపోవడం వల్ల క్యాంప్ ఆఫీస్, కార్యకర్తలు, నాయకులు లేక వెలవెల పోతుందనే విమర్శలకు గురవుతుంది. ఇదే పరిస్థితి గనుక ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలలో గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ కార్యకర్తలు బాహటంగా చెప్పుకుంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ల వస్తే మళ్లీ మాజీ ఎమ్మెల్యే 50 వేల పైచిలుకు ఓట్లతోటి గెలుస్తాడని కాంగ్రెస్ కార్యకర్తలే అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి పార్టీ కార్యాలయం లేకపోవడం వలన నియోజకవర్గాల నుండి వచ్చే కార్యకర్తలకు నాయకులకు కనీసం నిలువ నీడలేని పరిస్థితి ఉందని కొందరు కార్యకర్తలు తమ పేరు వెల్లడించవద్దని “నిజం” ప్రతినిధికి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇదే పరిస్థితి నెలకొంటే రాబోయే రోజుల్లో పార్టీ నియోజకవర్గంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిలు ఉత్తర్నమవుతాయని కరుడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలోని కార్యకలాపాలలో పాల్గొనడానికి మాజీ ఎమ్మెల్యే వస్తే ఆయనతో వందలాదిమంది పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ వెన్నంటే నడుస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు రెండవ శ్రేణి నాయకులు, కొద్దిమంది కరుడుగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప అది వందమందిలోపు, కార్యక్రమాలు చేసి చేతులు పిలుపుకుంటున్నారు. ఇదేంటయ్యా అని రెండవ శ్రేణి నాయకులను ప్రశ్నిస్తే మా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ మొత్తంలో ఉంటుంది అందుకే ముఖ్య నాయకులు హాజరు కారు అని తమ బాధను వెళ్ళబుచ్చారు.
మిగతాది రేపు.
