
గరుడ ప్రతినిధి(చౌడేపల్లి)
మండలంలోని దిగువపల్లి పంచాయతీలో వివిధ వనరులకు నిర్వహించిన వేలం పాటల ద్వారా రూ 13.75.500లు ఆదాయంగా సమకూరినట్లు ఈవోఆర్డీ కృష్ణవేణి తెలిపారు సోమవారం దిగువపల్లి సచివాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో సంవత్సర కాలం పాటు పంచాయతీ పరిధిలో ఐస్ క్రీములు విక్రయించుకునే హక్కుకు జరిగిన వేలంపాటలో మణికంఠ రూ 1,70,500లు హెచ్చుగా పడి పాటను దక్కించుకున్నారన్నారు అదేవిధంగా పంచాయతీ పరిధిలోనే చికెన్ దుకాణాలు నిర్వహించుకునే హక్కును సోమశేఖర్ రూ 12,05,000లు హెచ్చుగా పాడారన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ సచివాలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు

