
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి24,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లలో నీళ్లు లేక వరి చేనులు అన్ని ఎండిపోతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి,మండలంలోని పలు రైతుల వరి చేన్లను పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థాన్ నారాయణపురం మండలానికి ఎటువంటి సాగునీరు ప్రాజెక్టు లేదు కావున మండల వ్యాప్తంగా ఉన్న రైతులందరూ అనాదిగా భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు కానీ వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పొట్టకొచ్చిన వరి చేన్లు ఎండిపోవడంతో ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి వరి రైతులందరూ తీవ్ర నష్టాలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి,సంస్థాన్ నారాయణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని,ఎండిపోయిన వరి పంటకు ప్రతి ఎకరానికి 30 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురై రైతులు నష్టాలపాలు కాకుండా సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డి,మీద ఉన్నదని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజు గౌడ్,ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జక్కలి రాజు యాదవ్,కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర నరసింహ గౌడ్,జిల్లా నాయకులు వంగరి రఘు,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు సుర్వి వెంకటేష్ గౌడ్,సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన రైతులు గవ్వల ఆంజనేయులు,బద్దం బాలరాజ్ గౌడ్,కొమిశెట్టి నవీన్,తదితరులు,పాల్గొన్నారు.

