
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాఫర్,మార్చి25,(గరుడ న్యూస్ ప్రతినిధి):
హయత్ నగర్ సామ శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ హాల్ లో బచ్ పన్ పాఠశాల 9 వ వార్శికోత్సవం ఘనంగా జరుపోకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు ఆట పాటలతో అలరించడం జరిగినది,మరియు రైతు వేషధారణలో రైతు యొక్క విలువలను కళ్ళకు కట్టినట్టుగా విద్యార్థులు చూపించారు దేశానికి వెన్నుముక రైతు అని తెలియజేయడం అదేవిధంగా విద్యార్థిని,విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్,ఆరోగ్యం,ఆత్మ రక్షణ కుంగ్ ఫ్ మార్షల్ ఆర్ట్స్ వంటి విద్యను కూడా బోధించడం జరుగుతుందని,ఈ 9 వ వార్షికోత్సవంలో కుంగ్ ఫ్ మార్షల్ విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది.పాఠశాల డైరెక్టర్ కొమిరెల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియచేయడం జరిగినది.డైరెక్టర్ కొమిరెల్లి సంద్యా రాణి,కౌన్సిలర్ ఆవుల అనురాధ దేవి,శ్వేతా మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.

