సాలూరు లో రోడ్డు ప్రమాదం లో మహిళ దుర్మరణం….

Panigrahi Santhosh kumar
0 Min Read



గరుడ న్యూస్,సాలూరు

సాలూరు టౌన్ లో బుదవారం ఘోరం జరిగిపోయింది.కోట వీధి జంక్షన్ కోట దుర్గమ్మ గుడి వద్ద కర్రల లోడ్ తో ఉన్న టిప్పర్ లారీ బైక్ పైన వెనుక కూర్చున్న విజయనగరం జిల్లా,రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన 42 ఏళ్ల గౌరమ్మ అనే మహిళ మక్కువ మండలం ఎర్ర సామంతులవలసకు పయనం అవుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.లారీ పైనుండి దూసుకుపోవడం తో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.స్థానిక వ్యక్తుల సమాచారం తో పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.హృదయ విదారక సంఘటన తో విషాద ఛాయలు అలముకున్నాయి.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *