రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,తెరట్పెల్లి,మార్చి27,(గరుడ న్యూస్ ప్రతినిధి):
గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామంలోని గుండగోని మైసయ్య బాబాయ్ 27వ వర్ధంతి కార్యక్రమం గట్టుప్పల్ మండల శాఖ ఆధ్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం పోరాడుతున్నటువంటి బడుగు బలహీన వర్గాల నాయకుడిని అకారణంగా చేనేత కార్మికుల సమస్యల పరిష్కార కోసం గ్రామ గ్రామాన తిరుగుతూ తీరేట్పల్లి గ్రామానికి రావడం చూసినటువంటి నక్సలైట్లు కిరాతకంగా కాల్చి చంపి పేద ప్రజలకు తీరని అన్యాయం చేయడం జరిగింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం,జిల్లా కార్యదర్శి చిలువేరు దుర్గయ్య,జిల్లా కార్యదర్శి బత్తుల జంగయ్య,జిల్లా నాయకులు వంగరి రఘు,మండల పార్టీ అధ్యక్షులు ఎల్లప్ప,బండమీద కిరణ్,కంటాల బ్రహ్మయ్య,గూడూరు మంజునాధ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.