
రిపోర్టర్ సింగం కృష్ణ,బోనగిరి స్టాపర్,కుర్మగూడెం,మార్చి27,(గరుడ న్యూస్ ప్రతినిధి):
గణం బీరు మల్లయ్య కురుమ 19 వ వర్ధంతి సతీమణి గణం నరసమ్మ 21 వ వర్ధంతి సందర్భంగా కుమారుడైన గణం నర్సింహ్మ కురుమ,లక్ష్మీ దంపతులు కుమారులు గణం గిరిప్రసాద్ కురుమ,గణం హరిప్రసాద్ కురుమ,లు కుర్మగూడెం లోని ప్రాథమిక పాఠశాల,అంగన్ వాడి విద్యార్థులకు నోటు బుక్స్,పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గణం నర్సింహ్మ మాట్లాడుతూ గణం బీరు మల్లయ్య కుర్మగూడెం కురుమ కుల సంఘం పెద్ద కురుమగా సుమారు 30 సంవత్సరాలుగా పనిచేయడం జరిగిందని అలాగే 1990 నుండి 3 పర్యాయాలు గొర్రెల పెంపక దారుల సహకార సంఘం చైర్మన్ గా పని చేయడం జరిగిందని తమ కులస్తులకే కాకుండా గ్రామస్తులు అందరికీ కూడా అనేక సేవలు అందించినటువంటి వ్యక్తి గణం బీరు మల్లయ్య అని అన్నారు.గణం బీరు మల్లయ్య,అమ్మ గణం నరసమ్మ గార్ల వర్ధంతి సందర్భంగా తను చదువుకున్నటువంటి పాఠశాలలో విద్యార్థులకు మొదటి సంవత్సర వర్ధంతి సందర్భంగా ప్లేట్లు పంపిణీ చేయడం జరిగిందని ఈ సంవత్సరము విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని రాబోయే కాలంలో ఆయన తల్లిదండ్రుల పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని పేదలకు సహాయ సహకారాలు చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంశీకృష్ణ,ఉపాధ్యాయురాలు జ్యోతి,అంగన్వాడి పాఠశాల ఆయా రామలక్ష్మమ్మ,గ్రామ ప్రజలు,తదితరులు,పాల్గొన్నారు.
