
బ్రేకింగ్.. బ్రేకింగ్.. తిరుపతి జిల్లా, పాకాల గరుడ న్యూస్ (ప్రతినిధి): గతంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీపీగా వున్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేసి చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడంతో ఖాళీ అయిన ఎంపీపీ స్థానం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయడంతో తిరుపతి రూరల్ ఎంపీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మూలం చంద్రమోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక. మండలంలో మొత్తం 37 మంది ఎంపీటీసీ సభ్యులు వుండగా అందులో 34 మంది హాజరు కావడంతో ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకున్న అధికారులు. తిరుపతి రూరల్ మండలం నుంచి ఎంపీపీగా ఒకే వ్యక్తి ‘బి’ ఫాం అందించడంతో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన ఎంపీటీసీలు. ప్రత్యేక సమావేశానికి హాజరైన 34మంది ఎంపీటీసీల్లో 33 మంది ఎంపీటీసీల ఆమోదం తెలపడంతో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి మూలం చంద్రమోహన్ రెడ్డిని ఎంపీపీగా ప్రకటించిన ఎన్నికల అధికారి. ఎంపీటీసీల ఆమోదంతో ఎంపీపీగా ఎన్నికైన మూలం చంద్రమోహన్ రెడ్డికి డిక్లరేషన్ అందించి, అక్కడికక్కడే ప్రమాణ స్వీకారం చేయించిన ఎన్నికల అధికారి. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంతో జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి. మోహిత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించిన ఎంపీటీసీలు. మోహిత్ రెడ్డి నాయకత్వంలో తిరుపతి రూరల్ ఎంపీపీ అభ్యర్థిని గెలిపించుకోవడంతో సంబరాలు చేసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు. టపాకాయలు పేల్చి, రంగులు చల్లుకుంటూ మోహిత్ రెడ్డిని ఊరేగించుకుంటూ తమ ఆనందోత్సాహాలను పంచుకున్న పార్టీ శ్రేణులు. హైకోర్టు ఆదేశాలతో పోలీసుల భారీ భద్రత నడుమ విజయవంతంగా పూర్తి చేసిన తిరుపతి రూరల్ ఎంపీపీ ఎన్నిక. హైకోర్టు ఆదేశాలతో వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పోలీసులు, ఎంపిపి ఎన్నిక ప్రారంభం నుంచి ముగిసేంత వరకు భారీ భద్రత కల్పించిన తిరుపతి పోలీసులు. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన హిసాత్మక సంఘటనలు దృష్టిలో ఉంచుకుని ముందుగానే హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్ సీపీ నేతలు. తిరుపతి అదనపు ఎస్పీ రవిమనోహరాచారి పర్యవేక్షణలో భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎన్నికలను పూర్తి చేసిన పోలీసులు. వైఎస్ఆర్ సీపీ ఎంపీపీ అభ్యర్థి విజయోత్సాహంలో పాలు పంచుకున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి. ఎంపీడీవో కార్యాలయం నుంచి తుమ్మలగుంటకు చేరుకుని చెవిరెడ్డిని కలసి నూతన ఎంపీపీ మూలం చంద్రమోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీలు వి.మాదవరెడ్డి, వి.యశోదలతో పాటు ఎంపీటీసీలు.
నిజాయతీగా నిలబడి పార్టీ సూచించిన వ్యక్తిని ఎంపీపీగా గెలిపించిన ప్రతి ఒక్క ఎంపీటీసీని అభినందించిన చెవిరెడ్డి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పటిష్టతకు పనిచేస్తామని, ఎంపీపీ విజయం తమ బాధ్యతగా తీసుకున్నట్టు స్పష్టం చేసిన ఎంపీటీసీలు.


