
ఒబే గోదావరి జిల్లాలు, కొత్తపేట గరుడ న్యూస్ (ప్రతినిధి ): మనోజ్ వైన్స్ ని వెంటనే తొలగించాల. హిందూ దేవాలయాల మధ్యన కొత్తపేట బోడిపాలెం వద్ద గల బ్రాందీ షాపును వెంటనే తొలగించాలని ఎక్సైజ్ ఆఫీసు దగ్గర ధర్నా నిర్వహించిన బాధితులు. విషయం ఏమనగా గతంలో ఈ షాపుపై స్థానిక హిందూ బంధువులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఎక్సైజ్ సిఐ గారికి మరియు ఉన్నత అధికారులు కు ఫిర్యాదులు చేయడం జరిగింది. అయితే వారికి తాత్కాలిక లైసెన్స మాత్రమే 20 రోజులకు మాత్రమే ఇచ్చాము తరువాత మారుస్తామని అధికారులు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు షాపు ఎటువంటి మార్పులు జరగలేదని స్థానికులు ఆగ్రహిం హించి ఈరోజు ఎక్సైజ్ సర్కిల్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది సిఐ గారు అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐ రామచంద్రరావు గారికి ఫిర్యాదు ఇచ్చి వెంటనే మనోజ్ వైన్స్ తొలగించాలని లేనిచో పెద్ద ఎత్తున హిందూ ధార్మిక సంఘాలు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ మొదలగు సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలియజేశారు.. అనంతరం ఆర్డిఓ గా రికి కూడా కలిసి ఫిర్యాదు ఇవ్వగా. ఆయన స్పందించి పరిశీలించి మనోజ్ వైన్స్ ను వేరే చోటికి మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందరావు గారు మాట్లాడుతూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారని అధికారులు మామూలు మత్తులో ఇవి పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహించారు కొత్తపేట మండల శాఖ అధ్యక్షులు సంపతీ క నకేశ్వరరావు పాలాటి మాధవస్వామి ఇల్లా పల్లం శెట్టి. పెన్నాడ నారాయణరావు మరియు స్థానికులు పాల్గొన్నారు



