
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,మార్చి30,(గరుడ న్యూస్ ప్రతినిధి):
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రం ఉగాది పండగ సందర్భంగా ప్రాచిన ఉమామహేశ్వర దేవాలయం (శివాలయం),లో దేవస్థానం అధ్యక్షులు పాలకూర్ల సతీష్ గౌడ్ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో పాడి పంటలతో ఆనందంగా జీవించాలని అభిలాషించారు.

