
గరుడ న్యూస్,సాలూరు
శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా ఆదివారం విశ్వ వాసు నామ సంవత్సరాన్ని(ఉగాది) పురస్కరించుకుని ఉదయం సాలూరు పట్టణం వెలమపేట, డబ్బివీధి ప్రజలు రథంలో శ్రీరాములు స్వామి వారి విగ్రహాలను కోలాటాలతో, మేళతాళాలతో ఊరేగిస్తూ వారి మండపాలకు తీసుకు వస్తున్న కార్యక్రమంలో పాల్గొని రథం లాగారు. అనంతరం రెండు వీధుల్లో స్వామి వార్లను దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

