
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,మార్చ్31,(గరుడ న్యూస్ ప్రతినిధి):
బేగంపేటలోని తెలంగాణ టూరిజం ప్లాజాలో జరిగిన వేగ జువెలర్స్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీ అవార్డుల ప్రధానోత్సవం లో స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ గా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించిన,ఆ సంస్థ చైర్మన్ రాపర్తి సురేష్ గౌడ్ చేసిన సామాజిక సేవకార్యక్రమాలను గుర్తించి,వేగ జ్యువెలర్స్,సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు పూర్ణ నంది తెలుగు తేజం అవార్డును ప్రకటించారు.సోమవారం బేగంపేటలోని తెలంగాణ టూరిజం ప్లాజా లో జరిగిన అవార్డుల కార్యక్రమం లో రాపర్తి సురేష్ గౌడ్ కు హీరో జై,హీరోయిన్ ఐశ్వర్య,మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలచారి కలిసి అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత రాపర్తి సురేష్ గౌడ్ మాట్లాడుతూ.ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలు నేటి అవార్డుతో సామాజిక కార్యక్రమాలపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.ఈ అవార్డు రావడం మరింత బాధ్యత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.మునుముందు ఇంత ఉత్సాహంతో స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని తెలిపారు.నాకు నా గ్రామం పై ఉన్న ప్రేమతో అనేక కార్యక్రమాలు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్నానని.విద్యార్థుల భవిష్యత్తు కై సమాజంలోని ఆడబిడ్డలు,యువత విజయాలు సాధించాలని.ప్రతి విద్యార్థికి చదువుకునే బలమైన కోరిక ఉంటే పేదరికం అడ్డురాదు.పేదోడి తలరాత మార్చేది కేవలం విద్య ఒక్కటే అని విద్య తోటి సమాజంలో గౌరవం లభిస్తుందని అత్యున్నత స్థానాన్ని చేరుకుంటారని తెలిపారు.

