మంత్రివర్గ విస్తరణ  భాగంగా  4 పదవులు బీసీ లకు 2 ఎస్సీ మాదిగలకు ఇవ్వాలి:-బీసీ జేఏసీ

Sesha Ratnam
2 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,ఏప్రిల్1,(గరుడ న్యూస్ ప్రతినిధి):

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి లో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బిసి జేఏసీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా చైర్మన్ పెండెం ధనుంజయ్ నేత మాట్లాడుతూ త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో బీసీలకు 42 శాతం మంత్రి పదవులు ఇవ్వాలని,ఇప్పటివరకు ఇచ్చిన మంత్రి పదవుల్లో కేవలం బీసీలకు రెండు మాత్రమే ఇచ్చారని కార్పొరేషన్ చైర్మన్లు ఇతర నామినేటెడ్ పదవుల్లో తీవ్ర అన్యాయం బీసీలకు జరిగిందని బీసీ రిజర్వేషన్ బిల్లు బిల్లు పెట్టినాము అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం మంత్రి పదవులు ఇచ్చి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలిపారు.ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవిలో 4 నాలుగు బీసీలకు రెండు ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ జిల్లాలో ఉన్న ఒకే ఒక బీసీ ఎమ్మెల్యే అయిన బీర్ల ఐలయ్య యాదవ్ కు ఇప్పుడు జరిగే మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని అలాగే సీనియర్ శాసనసభ్యుడు అయిన  వేముల వీరేశం మాదిగ గారికి మంత్రి పదవులు కేటాయించాలని డిమాండ్ చేశారు.42 శాతం మంత్రి పదవులు ఇవ్వని పక్షంలో బీసీ మరియు బహుజన నాయకుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి లక్ష సాధనగా తమ కార్యక్రమాలు ఉంటాయని అన్ని రంగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీ సంఘాల అందరి ఐక్య కార్యాచరణతో బీసీలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు బీసీ జేఏసీ నాయకులు సింగం శ్రీకాంత్ యాదవ్,మహమ్మద్ నజీర్,చెన్నోజు రాజు,సంగం జగదీశ్వర్,దీకొండ నవీన్ కుమార్,మార్గం సతీష్ కుమార్,కర్నాటి జితేందర్,ఆవుల ప్రభాకర్ యాదవ్,గంజి వెంకన్న,తదితరులు పాల్గొన్నారు

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *