సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల రమణారెడ్డి

Panigrahi Santhosh kumar
1 Min Read

రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్2,(గరుడ న్యూస్ ప్రతినిధి):

రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కాంగ్రెస్ ప్రజా పాలనకు నిదర్శనం అని సంస్థాన్ నారాయణపురం కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మునగాల రమణా రెడ్డి అన్నారు.ఈ నేపద్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రజల అబిష్ఠానికి అనుగుణంగా సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.గతంలో ఆహార భద్రత పథకాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే విధంగా పాలన సాగిస్తుందని తెలిపారు.మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,ఆదేశానుసారం నియోజకవర్గంలోని ప్రజలందరికీ సన్న బియ్యం చేరువయ్యాయని తెలిపారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *