
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్4,(గరుడ న్యూస్ ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చకపోవడంతో నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా మండల అధ్యక్షులు ఆంబోతు హాతిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన దరఖాస్తుల సేకరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన బిజెపి మండల శాఖ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్,తండాలోని వృద్ధులను,మహిళలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్బంగా ఆ తండా ప్రజలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు మోసపోయి మేము ఓట్లు వేశామని,గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి మాకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి మమ్మల్ని నట్టేట ముంచాడని వృద్ధులు మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.వారితో మాట్లాడిన అనంతరం రాజుగౌడ్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు ₹2500/- రూపాయలు,వృద్ధులకు ఆసరా పింఛన్ ₹4000/- రూపాయలు ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేసాడని.ఆ యొక్క పథకాలను వెంటనే అమలు చేసేదాకా అన్ని గ్రామాలలో పర్యటించి ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తున్నామని దానికి ప్రజల తరపునుండి అనూహ్య స్పందన ఉందని ఈరోజు తీసుకున్న దరఖాస్తులను ప్రజల తరపున మండల తహసీల్దార్,జిల్లా కలెక్టర్ కి భారతీయ జనతా పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల శాఖ ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుందని ఆ రోజు ప్రతి గ్రామం నుండి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ భూత్ అధ్యక్షులు ఆంగోత్ భగవాన్ నాయక్,ఉదావత్ శంకర్ నాయక్,గూడూరు మంజునాథ్ రెడ్డి,సోషల్ మీడియా కన్వీనర్ కొర్ర రాజేష్ నాయక్,అంగోత్ రాజేంధర్ నాయక్,బిజెపి సీనియర్ నాయకుడు ఉదావత్ రామకోటి నాయక్,ఉదావత్ రవిబాబా,అంగోత్ అంజి నాయక్,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

