
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,సంస్థాన్ నారాయణపురం,ఏప్రిల్4,(గరుడ న్యూస్ ప్రతినిధి):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల కడుపు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు కుక్కల నరసింహ్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన సంక్షేమ పథకాల ఉద్దేశ్యం సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించి,వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.సన్న బియ్యం పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుదని అన్నారు.ప్రతి పేద కుటుంబం ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి నాంది పలికారని అన్నారు.దొడ్డు బియ్యం లబ్ధిదారులు తినకుండా దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు.ఎలాంటి అవకతవకలు జరగకుండా పేదవాడి కడుపు నింపడం కోసం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సరఫరా చేస్తామని అన్నారు.అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు,రాజీవ్ వికాసం రుణాలు ఇస్తామని,తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ఇది నిరంతర ప్రక్రియ అని ఈ సందర్భంగా తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం,ఉచిత కరెంటు కల్పించడంతో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,తదితరులు,పాల్గొన్నారు.

