
గరుడ ప్రతినిధి పుంగనూరు

మండలంలోని లదిగం పెద్ద ఎల్లకుంట్ల పంచాయతీ గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ చర్యలను కృష్ణవేణి పర్యవేక్షించారు వేసవిలో గ్రామీణ ఆరోగ్యం పై దృష్టి సారించాలని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు అధికారులకు ఆమె సూచించారు ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతను పాటించేలా ప్రజల్లో అవగాహన తేవాలన్నారు ముఖ్యంగా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులందు నీటి క్లోరినేషన్ క్రమం తప్పకుండా చేయించాలన్నారు త్రాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయా పంచాయతీల కార్యదర్శి పాల్గొన్నారు