
గరుడ న్యూస్,సాలూరు
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, వాసవి క్లబ్ విజయం,వాసవి క్లబ్ వనితాశ్రీ వారి ఆద్వర్యం లో
ఉప్పల వేంకటేశ్వర రావు గీతా గార్డెన్స్,బొడ్డ వలస లో మన సంస్కృతి,సంప్రదాయాలకు అనుగుణంగా తెలుగు నూతన సంవత్సరాది వేడుకలు అత్యంత వైభవం గా నిర్వహించారు.పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.డాక్టర్ హేమా నాయక్ ఆద్వర్యం లో వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల్ల రామకృష్ణ,డిస్ట్రిక్ట్ గవర్నర్ కుసుమంచి వెంకటరావు,ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ అత్మకూరి సతీష్,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఏ.వి.ఎస్.శేఖర్,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ బి.సన్యాసి రావు,డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజర ర్ ఎం. సి.హెచ్.గుప్తా, వైస్ గవర్నర్ ముత్యాలయ్య,రీజనల్ చైర్ పర్సన్ డా.జి.రవి కుమార్, రీజనల్ సెక్రటరీ, ఏ.వి.సత్యనారాయణ,జొన్ చైర్ పర్సన్ పేర్ల రమా లీల,వాసవి క్లబ్ విజయం సాలూరు ప్రెసిడెంట్ కోలగట్ల గోపి,సెక్రటరీ అవ్వా మంగ రాజు, ట్రెజరర్ గ్రంధి దుర్గాప్రసాద్,వాసవి వనితా శ్రీ ప్రెసిడెంట్ అరిశేట్టి సరోజ,సెక్రటరీ కోలగట్ల రమా దేవి, ట్రెజరర్ ఉప్పల సాయి లలిత తో పాటు ఆర్య వైష్య సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.కార్యక్రమం ఉల్లాసం గా ఉత్సాహం గా జరిగింది.

