
రిపోర్టర్ సింగం కృష్ణ,భువనగిరి స్టాపర్,ఏప్రిల్4,(గరుడ న్యూస్ ప్రతినిధి):
పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,సివిల్ సప్లై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి తెలంగాణ ప్రజల తరఫున మునుగోడు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.గత ప్రభుత్వంలో ఉప ఎన్నిక వస్తేనే రేషన్ కార్డులు ఇచ్చారు,కానీ మా ప్రజా ప్రభుత్వంలో ఉప ఎన్నికలు లేకపోయినా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం. రాబోయే రోజుల్లో పింఛన్లు రేషన్ కార్డులు,పేదవారికి ఇల్లు కట్టించే బాధ్యత నాది నియోజకవర్గంలో అక్రమంగా మద్యం అమ్మిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.బెల్ట్ షాపులు మూసివేసిన చాటుమాటుగా మద్యం అమ్మే వాళ్లను ఉపేక్షించము కేసులు పెట్టించి జైలుకు పంపిస్తాం.కాంగ్రెస్ పార్టీ అయినా బిజెపి పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీ అయినా ఏ పార్టీ నాయకుడైన అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

