గరుడ న్యూస్,సాలూరు
ఏప్రిల్ 22 న 55 వ ప్రపంచ ధరిత్రి దినోత్సవం.మన శక్తి,మన గ్రహం అనే థీమ్ తో ప్రపంచ వ్యాప్తం గా భూమిని పరిరక్షించేందుకు తమ వంతు గా మొక్కలు నాటాలని,ప్లాస్టిక్ వాడకం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయని అవగాహన కల్పించారు.పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఏప్రిల్ నెల 5 న ప్రారంభించారు.నెల మొత్తం కొనసాగుతాయని గ్రీన్ వరల్డ్ సేవా సంస్థ వ్యవస్థాపకులు సంతోష్ పాణి గ్రహీ తెలిపారు.ఈ కార్యక్రమం లో గ్రీన్ వరల్డ్ సభ్యులు సి.హెచ్.ఉమా శంకర్ రాజు,బుగత వంశీ కృష్ణ,యువత అధిక సంఖ్య లో పాల్గొన్నారు.